యాప్నగరం

శాసన మండలి రేపటికి వాయిదా

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాప తీర్మానాన్ని హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశ పెట్టారు. ప్రణబ్ కుటుంబానికి సంతాపం తెలిపారు.

Samayam Telugu 7 Sep 2020, 4:27 pm
ఇవాళ తెలంగాణ అసెంబ్లీతో పాటు, శాసనమండలి కూడా సమావేశం అయ్యింది. వానాకాలం సమావేశాల్లో భాగంగా ఈరోజు మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ మరణం పట్ల మండలి సంతాపం తెలిపింది. ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాప తీర్మానాన్ని హోం మంత్రి మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. దేశం గొప్పనేతను కోల్పోయిందని విచారం వ్యక్తంచేశారు. ప్రణబ్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
Samayam Telugu తెలంగాణ శాసన మండలి
telangana council


ప్రణబ్ ముఖర్జీని ప్రేమగా దాదా అని పిలుచుకునేవారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రణబ్ ముఖర్జీ ఉద్యోగి నుంచి రాష్ట్రపతిగా ఎదిగారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతి పదవికి వన్నెతెచ్చారని అన్నారు. చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాజకియాల్లో అనేక ఎత్తుపల్లాలు చూశారని వెల్లడించారు. మండలి సభ్యులు ప్రణబ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధించారు. అనంతరం మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను రేపటికి వాయిదా వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.