యాప్నగరం

Telangana RTC: ఎల్లుండి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు?

తెలంగాణలో ఆర్టీసీ బస్సులు మే 17 నుంచి తిరిగి రోడ్డు ఎక్కే అవకాశం ఉంది. నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Samayam Telugu 15 May 2020, 7:41 am
తెలంగాణలో గత రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు మే 17 నుంచి రోడ్డెక్కే అవకాశం ఉంది. నేడు (మే 15న) కేసీఆర్ నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే బస్సులను నడపడానికి సిద్ధంగా ఉంది. గ్రీన్ జోన్ల పరిధిలోని జిల్లాలతోపాటు హైదరాబాద్ శివార్ల వరకు బస్సులను నడిపే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు.
Samayam Telugu ఆర్టీసీ బస్సు


మాస్కులు ఉన్నవారిని మాత్రమే బస్సులు ఎక్కడానికి అనుమతి ఇవ్వడంతోపాటు.. బస్సు ఎక్కడానికి ముందు ప్రయాణికులకు తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారి ప్రయాణానికి అనుమతించరు. బస్సు ఎక్కక ముందే టికెట్లు ఇవ్వనున్నారు. ఇందుకోసం అన్ని బస్సుల్లోనూ ఆన్‌లైన్ ద్వారా టికెట్లు జారీ చేస్తారు. కండక్టర్ కూడా ముందే బస్ స్టేషన్లలో టికెట్లు ఇస్తారు.

సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కోసం బస్సులను 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడపనున్నారు. బస్సు ఎక్కే సమయంలో ఎక్కడ జనం గుమికూడే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. సగం సీట్లలోనే ప్రయాణికులను తీసుకెళ్తే... సంస్థపై అదనపు భారం పడే అవకాశం ఉండటంతో.. ఛార్జీలను పెంచే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రయివేట్ బస్సులు జూన్ నెలాఖరు వరకు తిరిగే అవకాశం లేదని సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.