యాప్నగరం

ఇకపై అక్కడ కూడా కరోనా చికిత్స.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ స్పష్టత

Telangana Coronavirus: దేశమంతా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తెలంగాణలోనూ ప్రజల కదలికలు ఎక్కువయ్యాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ వివరించారు. కరోనా లక్షణాలు ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Samayam Telugu 14 Jul 2020, 4:47 pm
తెలంగాణలో బోధనాసుపత్రుల్లోనూ (మెడికల్ కళాశాలలు) కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 12,178 ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా రోగుల రికవరీ రేటు 65.48 శాతంగా ఉన్నట్లు వివరించారు. కరోనా బాధితుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే చనిపోయారని వివరించారు.
Samayam Telugu ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
HEALTH director


దేశమంతా లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత తెలంగాణలోనూ ప్రజల కదలికలు ఎక్కువయ్యాయని, దీనివల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ వివరించారు. ఎవరిలో అయినా, కరోనా లక్షణాలు ఉంటే కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే, తెలంగాణలో మాత్రం 85 శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని చెప్పారు. కరోనా లక్షణాలు అంతగా లేని వారికి హోం ఐసోలేషన్‌ సదుపాయం ఇంటి వద్దకే అనుమతిస్తుండగా, సౌకర్యాలు సరిగ్గా లేని వారికి ప్రభుత్వ ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని వివరించారు.

Also Read: undefined

తెలంగాణలో ఉన్న మొత్తం కరోనా యాక్టివ్‌ కేసుల్లో 9,786 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని చెప్పారు. హైదరాబాద్‌లోని టిమ్స్‌లోనూ సోమవారం నుంచి చికిత్స జరుగుతోందని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 98 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతులు ఉన్నాయని వివరించారు. ఇక నుంచి ఖాళీగా ఉన్న పడకల వివరాలను డ్యాష్‌ బోర్డులో ఉంచుతామని చెప్పారు. ప్రజల సహాయం కోసం కరోనాపై అవగాహనకు 3 రకాల కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. 104కు ఫోన్‌ చేసి అన్ని రకాల సహాయాలు పొందవచ్చని తెలిపారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.