యాప్నగరం

సీఎం పదవికి రూ.2,500 కోట్లు ఇవ్వాలా..?: కేటీఆర్ ట్వీట్ వైరల్

కర్ణాటకలో సీఎం మార్పుపై ఈ నెల 10న నిర్ణయం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ ఇటీవల చెప్పిన సంగతి తెలిసిందే. తనకు సీఎం పదవికి కావాలంటే ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు రూ.2500 అడిగారంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 7 May 2022, 1:08 pm
జాతీయ పార్టీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’ అంటూ తన శైలిలో పంచ్ వేశారు. తాజాగా జేపీ నడ్డాను ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Samayam Telugu మంత్రి కేటీఆర్


హాలో.. నడ్డా జీ.. కర్ణాటకలో ముఖ్యమంత్రి కావాలంటే 2,500 రూపాయలు కోట్లు అడుగుతున్నారు అంట కదా..? అని కేటీఆర్ అడిగారు. 40 శాతం కమీషన్ ఇవ్వాలని కాంట్రాక్టర్, 30 శాత కమీషన్ ఇవ్వాలని హిందూ మఠం వాళ్లు కూడా అడుగుతున్నారని అన్నారు. వీటన్నింటిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. ఈడీ, ఐటీ, సీబీఐల విచారణకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయంటూ మంత్రి ట్వీట్ చేశారు.

కర్ణాటకలో సీఎం మార్పుపై ఈ నెల 10న నిర్ణయం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. 2500 కోట్ల రూపాయలు ఇస్తే.. తనకు సీఎం పదవి ఇస్తామని ఆశచూపారని ఆయన బాంబు పేల్చారు. ఢిల్లీ నుంచి వచ్చిన తనకు కొందరు ఈ ఆఫర్ గురించి చెప్పారని.. అయితే ఇలాంటి ఆఫర్లను నమ్మి మోసపోవద్దని బీజేపీ కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే బసనగౌడ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్‌ను జత చేస్తూ.. జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.