యాప్నగరం

తెలంగాణ ఉద్యమకారుడి ఆమరణ దీక్ష.. కేసీఆర్‌కు కట్టిన గుడి ముందే..

Dandepalli: ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన గుండా రవీందర్ గతంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు హల్‌చల్‌ చేశాడు. 2001 నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, పార్టీ పెద్దలు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

Samayam Telugu 14 Jul 2020, 3:49 pm
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో తెలంగాణ ఉద్యమ కారుడు ఒకరు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో జిల్లా నుంచి కీలక పాత్ర పోషించిన గుండా రవీందర్ తన ఇంటి ఆవరణలోని కేసీఆర్ ఆలయం వద్ద ఈ దీక్ష మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేశానని, ఈ క్రమంలో తన ఆస్తులు ఎన్నో కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పార్టీలో తనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని రవీందర్ వాపోయారు. కనీసం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో ఉండే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేలా అయినా తనకు ఓ అవకాశం ఇవ్వాలని గుండా రవీందర్ వేడుకున్నారు.
Samayam Telugu నిరాహార దీక్ష చేస్తున్న గుండా రవీందర్
Gunda Ravinder


ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన గుండా రవీందర్ గతంలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముందు హల్‌చల్‌ చేశాడు. 2001 నుంచి తాను తెలంగాణ ఉద్యమంలో ఉన్నానని, తెలంగాణ సాధించుకున్న తర్వాత ఉద్యమకారులకు, పార్టీ పెద్దలు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉద్యమకారుడైన తనకు ఎలాంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పంజాగుట్ట పోలీసులు అప్పట్లో అతణ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత విడిచి పెట్టారు.
Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.