యాప్నగరం

సమ్మె బాట.. తెలంగాణలో నిలిచిపోయిన ఆయిల్ ట్యాంకర్లు

చమురు సంస్థలో రవాణా ఛార్జీలో భారీగా కోత పెట్టడాన్ని నిరసిస్తూ... తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ యజమానులు సమ్మె చేపట్టారు. దీంతో సూర్యాపేట వద్ద ఆయిల్ ట్యాంకర్లు నిలిచపోయాయి.

Samayam Telugu 11 May 2020, 12:31 pm
తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాట పట్టారు. ఆయిల్‌ సంస్థలు రవాణా ఛార్జీలో 80 శాతం కోత పెట్టడంతో రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు. ఫలితంగా సూర్యాపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్‌ ట్యాంకర్స్‌ రోడ్డు వెంబడి నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్ల మీద ఆగిపోయాయి. సింగరేణి సంస్థకు కూడా ఆయిల్‌ ట్యాంకర్స్‌ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరాకపోతే తెలంగాణ మొత్తం ఆయిల్‌ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్‌ ట్యాంకర్స్‌ ఓనర్స్‌ హెచ్చరించింది.
Samayam Telugu oil tankers


లాక్‌డౌన్ సమయంలో ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేస్తే.. గ్యాస్, పెట్రోల్, డీజీల్‌ లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలను సోమవారం నుంచే ప్రారంభించిన నేపథ్యంలో.. పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో చమురు సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.