యాప్నగరం

ఓట్ల సమరంలో ఓనర్ల హవా.. ఫెయిలైన ప్రొఫెసర్లు!!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్తలు పైచేయి సాధించారు. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లను ఓట్ల సమరంలో ఓడించారు. ప్రొఫెసర్లు కోదండరాం, నాగేశ్వర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

Samayam Telugu 21 Mar 2021, 1:28 pm
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహకందని సిత్రాలు చోటుచేసుకున్నాయి. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లకంటే.. కాలేజీలు పెట్టినోళ్ల వైపే పట్టభద్రులు మొగ్గుచూపారు. అధికార టీఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచిన విద్యాసంస్థల యజమానులు విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రొఫెసర్లు ఓటమి చవిచూశారు. యజమానుల ముందు ప్రొఫెసర్లు నిలవలేకపోయారు. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి, పీవీ కుమార్తె వాణీదేవి చేతిలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓటమి చెందారు. బీజేపీ అభ్యర్థి రాంచందర్‌రావు తరువాత మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వాణీ దేవి పలు విద్యాసంస్థలకు వ్యవస్థాపక అధ్యక్షురాలిగా.. విద్యావేత్తగా పేరుపొందారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
vote


అటు నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గంలోనూ ఇదే సీన్ రిపీటైంది. విద్యాసంస్థల యజమాని.. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఓడిపోయారు. చివరి వరకూ పోటీనిచ్చిన కోదండరాం 70,072 మోదటి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్) దూసుకురావడంతో కోదండరాం వెనుకపడ్డారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తీన్మార్ మల్లన్న రెండో స్ధానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.