Telangana Police Conducts A Poll On People Intention Over Lockdown
లాక్ డౌన్పై తెలంగాణ పోలీసుల పోల్.. షాకింగ్ వాస్తవాలు
కరోనా వైరస్ (కొవిడ్-19) వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఈ లాక్ డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల వివిధ కారణాలు చెబుతూ చాలా మంది లాక్ డౌన్ను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి లాక్ డౌన్ ఉల్లంఘనలను తగ్గించేందుకు పోలీసులు బాగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను సీరియస్గా తీసుకోకుండా ఉదాసీనంగా ఉంటున్న వారి కోసం కొన్ని చోట్ల లాఠీలకు పని చెబుతుండగా, మరికొన్ని చోట్ల వినూత్న రీతిలో పోలీసులు కష్టపడుతున్నారు. అయితే, అసలు ఎన్నడూ జనం ఊసెరగని ఇలాంటి లాక్ డౌన్ పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు తెలంగాణ పోలీసులు ఓ పోల్ను నిర్వహించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ పోల్ను నిర్వహించగా.. ప్రజలు లాక్ డౌన్పై ఏం అనుకుంటున్నారో తమ అభిప్రాయం చెప్పాలని కోరారు. ఇందుకోసం నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. వాటికి వచ్చిన ఓట్ల ఆధారంగా పోలీసులు ఇలా విశ్లేషణ చేశారు.
Samayam Telugu1 Apr 2020, 7:56 pm
కరోనా వైరస్ (కొవిడ్-19) వల్ల దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ ఈ లాక్ డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల వివిధ కారణాలు చెబుతూ చాలా మంది లాక్ డౌన్ను ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి లాక్ డౌన్ ఉల్లంఘనలను తగ్గించేందుకు పోలీసులు బాగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ మిశ్రమ ఫలితాలే వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులను సీరియస్గా తీసుకోకుండా ఉదాసీనంగా ఉంటున్న వారి కోసం కొన్ని చోట్ల లాఠీలకు పని చెబుతుండగా, మరికొన్ని చోట్ల వినూత్న రీతిలో పోలీసులు కష్టపడుతున్నారు. అయితే, అసలు ఎన్నడూ జనం ఊసెరగని ఇలాంటి లాక్ డౌన్ పట్ల ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు తెలంగాణ పోలీసులు ఓ పోల్ను నిర్వహించారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఈ పోల్ను నిర్వహించగా.. ప్రజలు లాక్ డౌన్పై ఏం అనుకుంటున్నారో తమ అభిప్రాయం చెప్పాలని కోరారు. ఇందుకోసం నాలుగు ఆప్షన్లను ఇచ్చారు. వాటికి వచ్చిన ఓట్ల ఆధారంగా పోలీసులు ఇలా విశ్లేషణ చేశారు.
లాక్ డౌన్ కోరుకుంటున్న 62 శాతం ప్రజలు
తెలంగాణ పోలీసులు వెల్లడి చేసిన వివరాల ప్రకారం.. ‘‘మొత్తం 62 శాతం ప్రజలు లాక్ డౌన్ను కోరుకుంటున్నారు. వీరందరూ ఇంటికి ఒకరిని మాత్రమే. అదీ అత్యవసర లేదా నిత్యావసరాల కోసం బయటికి వెళ్లడానికి ఇష్టపడ్డారని విశ్లేషించారు. వీరి వ్లల ఎవరికీ ఇబ్బంది లేదు. కష్టం లేదా నష్టం కలగవు. ఎందుకంటే వారు మొత్తం సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్దే ఉంటూ అడుగు వెనక్కి వేస్తారు. అయితే, వీరిలో 20 శాతం మంది వ్యక్తులు తాము పాటించకపోయినా కూడా కోరుకుంటూ ఉండవచ్చు. కానీ ఆచరణలే ఇబ్బందులు పడుతున్నారు’’ అని విశ్లేషించారు.
Twitter-Telangana State Police
‘పోలీసులు వీరి నడ్డి విరగ్గొడితే బాగుండు’
‘‘27 శాతం ప్రజలు 3 నెలల లాక్ డౌన్ కోరుకుంటున్నారు. ఇలాంటి వారిని నిందించలేము. ఎందుకంటే వీరిలో 80 శాతం మంది ఇంటికి ఒకరు అత్యవసరమైతేనే బయటకు వస్తున్నారు. ఈ సూత్రాన్నే అమలు చేస్తున్నారు. కానీ, తమ చుట్టూ ఉన్న వారు చాలా బాధ్యతారాహిత్యంగా ఉండడం చూసి బాధపడుతున్నారు. మరో 5 శాతం ప్రజలు 6 నెలల లాక్ డౌన్ను కోరుకుంటున్నారు. కానీ, బాధ్యత లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిని చూస్తూ ‘ఇలాంటి వారికి 21 రోజులు కాదు.. 6 నెలల లాక్ డౌన్ విధించి పోలీసులు వీరి నడ్డి విరగ్గొడితే బాగుండు’ అని అనుకుంటున్నారు.’’
‘‘మరో 6 శాతం ప్రజలు నో ఐడియా అని చెప్పారు. వీరిలో కొంత అయోమయం ఉంది. కానీ, బాధ్యతారాహిత్యం కూడా ఏమీ లేదు, కానీ కొందరు ఈ పరిస్థితులు బాగున్నాయని అనుకొని ఉండవచ్చు. క్రమ శిక్షణ అలవడుతుందని సంతోషించవచ్చు. ఒక పక్క బాధ్యతారాహిత్యంగా తిరిగే వారి ప్రవర్తనకు విచారం కూడా వ్యక్తం చేయవచ్చు. నగరాల్లో కేవలం 50 శాతం ప్రజలు మాత్రమే కచ్చితంగా నియమాలు పాటిస్తున్నారు. గ్రామాల్లో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిన నిబంధనలు పాటిస్తున్నారు. చదువు లేని వారు, వ్యవసాయదారులు 100 శాతం నిబంధనలు పాటిస్తున్నారు. చదువుకున్న వారిలో 18 నుంచి 25 ఏళ్ల మధ్య గల యువత పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది’’ అని పోలీసులు విశ్లేషించారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.