యాప్నగరం

Telangana Policeలకు రాష్ట్రపతి మెడల్స్.. మహేశ్ భగవత్‌కు మూడోసారి..!

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన తెలంగాణలోని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ చుంగి‌లను రాష్ట్రపతి మెడల్స్‌కు ఎంపిక చేశారు.

Edited byరావు | Samayam Telugu 15 Aug 2022, 6:37 am

ప్రధానాంశాలు:

  • స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పోలీసులకు మెడల్స్
  • మహేశ్ భగవత్, దేవేంద్ర సింగ్‌కి రాష్ట్రపతి పోలీస్ మెడల్స్
  • మరో 12 మందికి మెరిటోరియస్ పతకాలను ప్రకటించిన కేంద్ర హోంశాఖ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mahesh Bhagwat
మహేశ్ భగవత్
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ సేవలు అందించిన తెలంగాణలోని ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర అడిషనల్ డీజీపీ హోదాలో రాచకొండ పోలీస్ కమిషనర్‌గా ఉన్న మహేశ్ మురళీధర్ భగవత్, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న దేవేందర్ సింగ్ చుంగి‌లను రాష్ట్రపతి మెడల్స్‌కు ఎంపిక చేయగా.. మరో 12 మంది పోలీసు అధికారులకు మెరిటోరియస్ సర్వీస్ పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు ప్రతిష్టాత్మక పోలీస్ మెడల్ దక్కడం ఇది మూడోసారి కావడం విశేషం. 2004లో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2011లో పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియన్ సర్వీస్ పురస్కారాలను ఆయన అందుకున్నారు. తాజాగా ప్రెసిడెంట్ మెడల్‌తో మూడోసారి ప్రతిష్టాత్మక మెడల్ దక్కించుకున్నారు.

అదేవిధంగా.. పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధన విభాగం అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న ఏఆర్ శ్రీనివాస్, సీఐడీ అదనపు ఎస్పీ పాలేరు సత్యనారాయణ, హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ సాయిని శ్రీనివాసరావు, ఎస్‌‌ఐబీలో పనిచేస్తున్న అదనపు ఎస్పీ పైళ్ల శ్రీనివాస్, ఖమ్మ ఏసీబీ డీఎస్పీ సూరాడ వెంకట రమణమూర్తి, పోలీస్ అకాడమీలో డీఎస్పీగా ఉన్న గంగిశెట్టి గురు రాఘవేంద్ర, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, రామగుండం సీఎస్‌బీ ఎస్సై చిప్ప రాజమౌళి, రాచకొండ ఎస్‌బీ ఏఎస్సై శ్రీనివాస్, కామారెడ్డి హెడ్‌క్వార్టర్స్ ఏఆర్ ఎస్సై జంగన్నగారి నీలంరెడ్డి, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్, మామునూర్ బెటాలియన్ ఏఆర్ ఎస్సై సలేంద్ర సుధాకర్ మెరిటోరియల్ మెడల్స్‌కు ఎంపికయ్యారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.