యాప్నగరం

ఖతర్ నుంచి వచ్చిన 37 మంది అడ్డగింత.. బాధితులంతా ఏపీ వారే..

Zahirabad: ఖతర్ నుంచి ముంబయికి వచ్చాక వారి ఏజెంట్ ముంబయి నుంచి సన్‌షైన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సును బుక్ చేశాడని బస్సు డ్రైవర్ చెప్పాడు. ఈ బస్సు హైదరాబాదుకు వస్తుండగా మాడ్గీ చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఆపేశారు.

Samayam Telugu 22 Mar 2020, 11:17 am
మెదక్ జిల్లా జహీరాబాద్ శివారులోని మాడ్గి అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు దగ్గర ముంబయి నుంచి వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును పోలీసులు అడ్డుకున్నారు. ఈ బస్సులో దాదాపు 37 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులుగా పోలీసులు గుర్తించారు. అయితే, తామంతా ఖతర్ నుంచి ముంబయి చేరుకున్నామని 37 మంది చెప్పారు. ముంబయిలోని విమానాశ్రయంలో అధికారులు తమకు వైద్య పరీక్షలు చేసినట్లుగా తెలిపారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఉపాధి కోసం తాము ఖతర్‌కు వలస వెళ్లామని పోలీసులతో అన్నారు.
Samayam Telugu 67728301_375905509779518_5622583588894539776_n


Must Read: కరోనా బాధితులకు చికిత్స ఎలా? గాంధీ వైద్యులు నయం చేశారిలా..

ఖతర్ నుంచి ముంబయికి వచ్చాక వారి ఏజెంట్ ముంబయి నుంచి సన్‌షైన్ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సును బుక్ చేశాడని బస్సు డ్రైవర్ చెప్పాడు. ఈ బస్సు హైదరాబాదుకు వస్తుండగా మాడ్గీ చెక్ పోస్టు దగ్గర పోలీసులు ఆపేశారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు దాటి వెళ్లనిచ్చేది లేదని పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

Must Read: కరీంనగర్: ఇండోనేసియన్లను రప్పించిన వ్యక్తి అరెస్టు, ఆస్పత్రిలోనే విచారణ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.