యాప్నగరం

కరోనాపై తెలంగాణ సర్కార్ చేదు వార్త.. మరో 4 వారాల్లో..

Telangana Coronavirus: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా స్థితిని సామాజిక వ్యాప్తి అని అనలేమని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని వెల్లడించారు.

Samayam Telugu 23 Jul 2020, 7:33 pm
రోజురోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్‌ కేసులతో ఇప్పటికే భయానికి గురవుతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం చేదు లాంటి వార్తను ప్రకటించింది. కరోనా వైరస్‌ ప్రభావం వచ్చే నాలుగైదు వారాలు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా వైరస్‌ మహమ్మారి సామాజిక వ్యాప్తి దశలోకి వెళ్లిందని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉంటుందని ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. సామాజిక వ్యాప్తికి సంబంధించి నిర్దేశితమైన నిర్వచనం లేదని వెల్లడించారు.
Samayam Telugu ప్రజారోగ్యశాఖ డైరెక్టర్
coronavirus community spread


అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కరోనా స్థితిని సామాజిక వ్యాప్తి అని అనలేమని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ చెప్పారు. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కేసులు పెరుగుతున్నాయని, కరోనాకు త్వరగా చికిత్స చేస్తే చాలా మంచిదని వెల్లడించారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రంలోని పీహెచ్‌సీల్లో (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) కరోనా టెస్ట్‌లను పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టెస్టుల నిర్వహణకు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు.

ఇక యాంటీబయాటిక్స్ మందులు, ఇంజెక్షన్లు అన్ని కలిపి రూ.150 ఖర్చు మాత్రమేనని తెలిపారు. సకాలంలో వైద్యం అందితే రూ.లక్షల అవసరం లేదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. లక్షల రూపాయలు ప్రయివేటు హాస్పిటల్‌లో ఎందుకు ఛార్జ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటికీ 6,500 పడకలు ఖాళీగా ఉన్నాయని, అన్ని జిల్లా కేంద్రాల్లో కొవిడ్ చికిత్స చేస్తున్నారని వివరించారు. ప్రజలు అత్యవసరమైతేనే హైదరాబాద్‌ రావాలని తెలిపారు. కరోనా గురించి కోర్టులో రోజుకొకరు పిటిషన్‌లు వేయడం మంచి పరిణామం కాదని అభిప్రాయపడ్డారు. వైద్య సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ఇప్పటికే సిబ్బంది చాలా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.