యాప్నగరం

భారీ వర్షాలకు సర్టిఫికెట్లు గల్లంతు.. ఆందోళన వద్దన్న మంత్రి సబిత

భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరం అయితే వాన నీటిలో జలదిగ్భంధం అయ్యింది. అనేకమందికి నిలువు నీడ లేకుండా పోయింది.

Samayam Telugu 18 Oct 2020, 7:47 am
రాష్ట్ర రాజధానిని భారీ వర్షం అతలా కుతలం చేసింది. నగరంలోని పలు కాలనీలు, బస్తీలు ఇప్పటికీ వరద నీటిలోనే ఉన్నాయి. వాన తగ్గి ఐదు రోజులైనా నీరు అలానే ఉంది. దీంతో ఇల్లు వదిలి పునరావాస కేంద్రాల్లో, బంధుమిత్రుల ఇళ్లలో బాధితులు తల దాచుకుంటున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులు, నిత్యవసర సరుకులు వరద నీటిలో నాని పాడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు ఇళ్లు నీట మునగడంతో పలువురు విద్యార్థుల సర్టిఫికెట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
Samayam Telugu హైదరాబాద్ భారీ వర్షాలు
Hyderabad floods


ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ నష్టం ఎక్కువగా ఉండగా, జిల్లాల నుంచి కూడా విద్యాశాఖకు ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఆమె స్పందించారు. దరఖాస్తు చేసిన ప్రతి విద్యార్థికీ కొత్తపత్రాలు జారీ చేస్తామని శనివారం మంత్రి ప్రకటించారు. ధ్రువీకరణ పత్రాలు కోల్పోయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దని ఆమె భరోసా ఇచ్చారు.

Read More: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాల వారిలో వణుకు

నీలు, బస్తీలు నీట మునిగాయి. మెజార్టీ ప్రాంతాల్లో రెండు, మూడు రోజుల్లో వరద నీరు బయటకు వెళ్లగా.. ఇప్పటికీ ముంపులోనే కొన్ని ఏరియాలున్నాయి. పల్లంలో ఉన్న ఇళ్ల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. కొన్ని చోట్ల నీరు తగ్గిన బురద మాత్రం వదలడం లేదు. ఇప్పటికే అనేకమంది ప్రజలు ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్తున్నారు. నగరంలో వందలకొద్ది అపార్టమెంట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.