యాప్నగరం

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా.. ఇవాళ కేసులు ఎన్నంటే

కరోనాతో ఐదుగురు మరణించారు. 15,205 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 92.34% శాతంగా ఉంది.

Samayam Telugu 11 Nov 2020, 9:25 am
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే నిన్నటితో పోలిస్తే కొన్ని కరోన కేసులు తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1196 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,53,651 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1390 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 18,027గా ఉన్నాయి.వారిలో 15,205 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు


Read More: ఓడిపోయినందుకు 101 కొబ్బరికాయలు కొట్టిన టీఆర్ఎస్ నేత

ఇప్పటి వరకు తెలంగాణాలో 2,34,234 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,745 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 92.34% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.7% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0..54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 44,635 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 47,29,401 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 192 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.