యాప్నగరం

తెలంగాణలో 1267 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల తీరు రోజుకొకలా ఉంది. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య పెరుగుతోంది. మరణాల సంఖ్య 14వందలకు చేరువలో ఉంది.

Samayam Telugu 10 Nov 2020, 9:01 am
తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుతున్నట్లు తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న వేయిలోపు నమోదైన కేసులు ఇవాళ 12వందలు దాటాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1267 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,52,455 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో నలుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 1385కు చేరింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 18,581గా ఉన్నాయి. వారిలో 15,794 మంది హోం ఐసోలేషన్‌ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
coronavirus cases in Telangana


Read More: దుబ్బాక కౌంటింగ్ ప్రారంభం.. అరగంటలో తొలి రౌండ్ ఫలితం

తెలంగాణాలో 2,32,489 మంది ఇప్పటివరకు కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,831 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 92.09% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 92.6% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0..54%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 42,490 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 46,84766 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 201 కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.