యాప్నగరం

తెలంగాణ ప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన కరోనా కేసులు

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడంతో తెలంగాణ ప్రజలంతా ఉపశమనం పొందారు. ఇవాళ అత్యల్పంగా కేసలు నమోదు కావడంతో ఊరట లభించింది. మరోవైపు రికవరీ రేటు కూడా పెరిగింది.

Samayam Telugu 28 Sep 2020, 10:25 am
తెలంగాణలో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,378 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదుయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 1,932 మంది కోలుకొని డిశ్చార్జి కాగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,87,211 మంది కోవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 1,56,431 మంది చికిత్సకు కోలుకున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఇప్పటివరకు 1107 మంది మృతి చెందారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


ప్రస్తుతం 29,673 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా హోం ఐసోలేషన్‌లో 24,054 మంది ఉన్నారు. అత్యధికంగా జీహెచ్ఎంసిలో 254, రంగారెడ్డి 110 కరీంనగర్ 78, కేసులు నమోదు అయ్యాయి. మిగితా ప్రాంతాల్లో అత్యల్పంగానే కేసులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా రెండు వేలు దాటి వస్తున్న కేసులతో తాజా పరిణామం కాస్త ఊరట కలిగించింది. రాష్ట్రంలో రికవరీ రేటు 83.55% శాతానికి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.