యాప్నగరం

తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. ఇవాళ కేసులు ఎన్నంటే

నిన్నమొన్నటివరకు తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. మరోవైపు మరణాలు కూడా 1350కు చేరువలో ఉన్నాయి. రికవరీ రేటు తెలంగానలో 91.84 శాతంగా ఉంది.

Samayam Telugu 1 Nov 2020, 9:50 am
తెలంగాణాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్న కరోనా కేసులు కొద్ది రోజులుగా మళ్ళీ అత్యధికంగా నమోదవుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,416 పాజిటివ్కే సులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,40,048 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. ఇప్పటి వరకు 1341 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణా రాష్ట్రంలో 18,241 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Samayam Telugu తెలంగాణలో కరోనా కలకలం
corona cases in telangana


Read More: తల్లి వాట్సాప్ స్టేటస్ పెట్టింది.. కొడుకొని జైలుకు పంపింది

15,388 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,20,466 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,579 మంది కరోనా నుంచి కోలుకున్నారు. . రాష్ట్రంలో నిన్న 41,675 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 43,23,666 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 279 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణాలో రికవరీ రేటు 91.84% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 91.5% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.55%గా ఉన్నాయి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.