యాప్నగరం

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

మళ్లీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నిన్నమొన్నటివరకు కాస్త ఊరట నిచ్చిన కేసులు మళ్లీ పెరిగాయి. మరణాల సంఖ్య 1319కు చేరింది.

Samayam Telugu 28 Oct 2020, 9:55 am
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతోంది. నిన్న మొన్న వెయ్యిలోపే నమోదైన కేసులు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,481 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,34,152కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,319కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
telangana corona cases


కరోనాబారి నిన్న ఒక్క రోజే 1,451 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,14,917 చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,883 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే 1,451 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 91.14% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 91.78% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి.

Read More: రాష్ట్రంలో కరోనా మళ్లీ విజృంభించే అవకాశం.. మూడునెలలు మరింత అప్రమత్తం

మరోవైపు వచ్చే మూడు నెలలు శీతాకాలం కావడంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు మరోసారి విజృంభించే అవకాశం ఉండటంతో ప్రజలంతా కఠినంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. శీతాకాలం ప్రారంభం కావడంతో అమెరికా, ఐరోపా దేశాల్లో రెండో దశలో కొవిడ్‌ కేసులు భారీ ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రభుత్వ యంత్రాగం దృష్టి పెట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.