యాప్నగరం

1300కు చేరువలో కరోనా మరణాలు .. తాజా కేసులు ఎన్నంటే

కరోనా కేసులు రోజుకో మాదిరిగా నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్య మాత్రం 1300కు చేరువలో ఉన్నాయి. రికవరీ రేటు బాాగానే ఉండటంతో ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లైంది.

Samayam Telugu 23 Oct 2020, 9:30 am
తెలంగాణాలో కరోనా కేసులు రోజుకొకలా నమోదవుతున్నాయి. ఓరోజు కాస్త తగ్గితే.. మరోరోజు పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 1,421 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,29,001 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 6 గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1298కు చేరింది. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 20,377గా ఉన్నాయి. వారిలో 17,214 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More: కరోనాతో భర్త మృతి... బిల్డింగ్‌పై నుంచి దూకిన భార్య

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 2,07,326 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 1,221 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 90.53% శాతంగా ఉంది. అదే సమయంలో భారత్‌లో రికవరీ రేటు 89.5% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.56%గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 38,484 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 40,17,353 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 249 కేసులు నమోదయ్యాయి.త

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.