యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. తాజాగా ఎన్నంటే

రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 1324గా ఉంది. ఇప్పటివరకు 41,96,958కి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 288 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

Samayam Telugu 29 Oct 2020, 9:30 am
తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంతకుముందు వెయ్యిలోపే నమోదైన పాజిటివ్ కేసులు మరోసారి 1500 దాటుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 41,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా ఈ కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,35,656కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,324కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More: ఎమ్మెల్యే ఫోన్ చేస్తే... మంత్రి తలసానిని బూతులు తిట్టిన కమిషనర్

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 1,436 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,16,353కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 17,979 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 14,938 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 41,96,958కి చేరింది.జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 288 కేసులు నమోదయ్యాయి. ఎప్పటిలాగే జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 288 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి 118, రంగారెడ్డి 115 చొప్పున నమోదయ్యాయి. ఇక మిగతా జిల్లాల్లో పదుల సంఖ్యలో నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.