యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వైరస్.. తాజాగా 1500 దాటిన కేసులు

ఓ వైపు వర్షాలు.. మరోవైపు కరోనా కేసులు రాష్ట్ర ప్రజల్ని వణికిస్తున్నాయి. తగ్గిన పాజిటివ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 21 Oct 2020, 9:17 am
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కాస్త తగ్గిన కేసులు మళ్లీ 1500 దాటి నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,579 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 2,26,124కు చేరింది. ఐదుగురు కరోనా కారణంగా మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1287కు చేరింది . తాజాగా కరోనా నుంచి కోలుకున్నవారు 1811. ఇప్పటివరకు కరోనా నుంచి విజయవతంగా కోలుకున్న వారి సంఖ్య 2,04,388.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More:దమ్ముంటే కేసీఆర్‌ను తీసుకురా.. హరీశ్‌ రావుకు డీకే అరుణ గట్టి సవాల్

రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,449గా ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో - 17,071మంది ఉన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.56 శాతంగా ఉంది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో కోలుకున్నవారి రేటు 90.38 శాతం.
దేశంలో కోలుకున్నవారి రేటు 88.8 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ జీహెచ్ఎంసీ పరిధిలో 256 నమోదు అయ్యాయి. ఖమ్మంలో 106, మేడ్చల్‌ మల్కాజిగిరి - 135, రంగారెడ్డి - 102 రికార్డ్ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.