యాప్నగరం

తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 1921 కేసులు, 9 మరణాలు

తెలంగాణలో కొత్తగా 1921 కరోనా కేసులను గుర్తించగా.. మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో 400 కంటే తక్కువగా కేసులు నమోదు కావడం గమనార్హం.

Samayam Telugu 14 Aug 2020, 9:19 am
తెలంగాణలో గురువారం 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 88,396కు చేరింది. గురువారం రాష్ట్రంలో 1210 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ రికవరీ అయిన వారి సంఖ్య 64 వేలు దాటింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,438 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారం కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 674కు చేరింది.
Samayam Telugu Coronavirus
Representative image


కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 356 కేసులు మాత్రమే ఉండటం గమనార్హం. బుధవారం హైదరాబాద్ పరిధిలో 298 కేసులు నమోదు కాగా.. గురువారం ఆ సంఖ్య కొద్దిగా పెరిగింది. మేడ్చల్‌లో 168 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 134, సంగారెడ్డిలో 90, వరంగల్ అర్బన్‌లో 74 కేసులు నమోదయ్యాయి.

కరీంనగర్, నల్గొండ జిల్లాలో 73 చొప్పున, ఖమ్మం 71; నిజామాబాద్, సిద్ధిపేట 63 చొప్పున కేసులను గుర్తించారు. కేసుల తీవ్రత తక్కువగా ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ 17 కొత్త కేసులను గుర్తించారు. నారాయణపేట జిల్లాలో తక్కువగా ఆరు కేసులను మాత్రమే గుర్తించారు.

గురువారం 22,046 శాంపిళ్లను పరీక్షించగా.. 1151 శాంపిళ్ల ఫలితం తేలాల్సి ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 7.11 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. మిలియన్ జనాభాలో 19,156 మందిని టెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.