తెలంగాణలో కాస్త తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల సంఖ్య 1100కు చేరింది. అయితే రికవరీ రేటు మాత్రం బాగా ఉండటం కాస్త ఊరట కల్గిస్తోంది.
Samayam Telugu 27 Sep 2020, 9:58 am
తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. నిన్నమొన్నటి వరకు రెండువేలకు పైగా నమోదైన కేసులు ఈరోజు కాస్త కేసుల నమోదు తగ్గింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,967 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,85,833 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 9 మంది మరణించారు. ఇప్పటి వరకు 1100 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 30,234గా ఉన్నాయి.
Read More: తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,54,499 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,058 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 83.13% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 82.39% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,108 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 28,50,869 పరీక్షలు చేసారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 297, కరీంనగర్ 152, రంగారెడ్డి 147 కేసులు నమోదయ్యాయి.
Read More: తెలంగాణకు మూడు రోజుల పాటు భారీ వర్షాలు
ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,54,499 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,058 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 83.13% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 82.39% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.59 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 50,108 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 28,50,869 పరీక్షలు చేసారు. కొత్తగా జీహెచ్ఎంసీలో 297, కరీంనగర్ 152, రంగారెడ్డి 147 కేసులు నమోదయ్యాయి.