యాప్నగరం

తెలంగాణ కరోనా అప్ డేట్.. వైరస్‌తో ఇద్దరు మృతి

కరోనా కారణంగా మొత్తం మరణాల సంఖ్య 1574కు చేరింది. కరోనా నుంచి నిన్న ఒక్క రోజే 253 మంది కోలుకున్నారు.

Samayam Telugu 15 Jan 2021, 11:02 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 19,898 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 202 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,91,118కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,574కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 253 మంది కోలుకున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More: Covid Vaccine: ఏ వయసు వారు వ్యాక్సిన్ వేయించుకోవాలి? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ?

దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,85,102కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,442 ఉండగా వీరిలో 2,541 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 73,99,436కి చేరింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు అత్యవసర వినియోగానికి కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ నెల 16 నుంచి దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే రోజు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.