యాప్నగరం

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభణ.. ఇవాళ కేసులు ఎన్నంటే

నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మరోసారి రెండువేలు దాటి నమోదు అయ్యాయి. కరోనా వల్ల తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో 9మంది చనిపోయారు.

Samayam Telugu 29 Sep 2020, 10:18 am
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2072 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది కరోనా కారణంగా చనిపోయారు. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,89,283కి చేరింది. అలాగే మొత్తం మృతుల సంఖ్య 1116గా నమోదు అయ్యింది. ప్రస్తుతం తెలంగాణలో 29,477 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స పొంది 1,58,690 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: ఆస్తిలో వాటా ఇవ్వాలని ఏడాది చిన్నారి హత్య

అలాగే 23,934 మంది హోం ఐసోలేషన్లలో ఉన్నారు. జీహెచ్ఎంసీలో 283, కరీంనగర్ 109, మేడ్చల్ 160, నల్లగొండ 139, రంగారెడ్డి 161 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణాలో రికవరీ రేటు 83.83% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 82.88% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,308 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 29,40,642 పరీక్షలు చేసారు. నిన్న కరోనా కేసులు కాస్త తగ్గడంతో ప్రజలంతా ఊరట పొందారు. మళ్లీ ఇవాళ భారీగా పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.