యాప్నగరం

తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం.. రెండువేలు దాటుతున్న కేసులు

అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 298 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ తాజగా 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరోవైపు రెండు లక్షలకు చేరువలో పాజిటివ్ కేసుల సంఖ్య ఉంది.

Samayam Telugu 30 Sep 2020, 9:59 am
తెలంగాణలో కరోనా కలకలో కొనసాగుతూనే ఉంది. తగ్గినట్లే తగ్గి కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు రెండువేలకుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,103 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 11 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,91,386 కేసులు నమోదు కాగా, మొత్తం 1127 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,243 మంది కోలుకోగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 1,60,933 ఉన్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: జీవిత ఖైదీలకు శుభవార్త.. అక్టోబర్ 2 విడుదల..

మరణాల రేటు రాష్ట్రంలో 0.58 శాతం ఉండగా, దేశంలో 1.56 శాతం ఉంది. ఇక కోలుకున్నవారి రేటు రాష్ట్రంలో 84.08 శాతం ఉండగా, దేశంలో 83,27 శాతం ఉంది. ఇక యాక్టివ్‌ కేసులు 29,326 ఉన్నాయి. జిల్లాలో వ్యారిగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 298, కొత్తగూడెం 102, కరీంనగర్‌ 103, మేడ్చల్‌ మల్కాజిగిరి 176, నల్గొండ 141, రంగారెడ్డి 172 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.