యాప్నగరం

తెలంగాణలో కరోనా కలకలం.. భారీగా పెరిగిన కేసులు

నిన్నమొన్నటి వరకు రెండు వేలు లోపు రికార్డ్ అయిన పాజిటివ్ కేసులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇవాళ కరోనా కేసులు రెండువేలు దాటడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Samayam Telugu 7 Oct 2020, 10:16 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మళ్లీ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 54,277 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 2,154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1189కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,239 మంది కోలుకున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona virus cases in telangana


దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,77,008కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,551 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,46,472కి చేరింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు.. జీహెచ్‌ఎంసీ 303 నమోదు అయ్యాయి. ఖమ్మం 121, మేడ్చల్‌ మల్కాజిగిరి 187, నల్గొండ 124, రంగారెడ్డి 205 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. ఇక కోలుకున్న వారి రేటు రాష్ట్రంలో 86.45 శాతం ఉండగా, దేశంలో 84.9 శాతం ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.

Read More: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన

మరోవైపు దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,99,857 పరీక్షలు నిర్వహించగా..72,049 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ నమోదైన కేసుల సంఖ్య 67,57,132కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో 986 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,04,555కి పెరిగింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.