యాప్నగరం

తెలంగాణలో కొత్తగా 2159 కరోనా కేసులు.. వెయ్యి దాటిన మరణాలు

తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. నిన్న 9 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 1005కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30443 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Samayam Telugu 17 Sep 2020, 10:20 am
తెలంగాణలో కరోనా కేసులు కలకలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 53,094 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా తాజాగా 2,159 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1005కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,108 మంది కోలుకున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
Telangana corona cases


Read More:
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 12 బిల్లులకు సభ ఆమోదం

దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,33,555కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,443 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 23,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 23,29,316కి చేరింది. జీహెచ్ఎంసిలో 318, కరీంనగర్ లో 127, మేడ్చల్ లో 121, నల్గొండలో 141, రంగారెడ్డి 176, సిద్దిపేటలో 132 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.