యాప్నగరం

తెలంగాణలో కరోనా విజృంభణ.. కొత్తగా పాజిటివ్ కేసులు ఎన్నంటే

కరోనా మరణాల సంఖ్య వెయ్యి దాటింది. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 39వేలమంది ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నారు.

Samayam Telugu 20 Sep 2020, 10:09 am
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజు రెండు వేలు దాటి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2137 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య లక్షా 71306కు చేరింది. నిన్న కరోనాతో పోరాడుతూ 8 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 1033కు చేరింది. ప్రస్తుతం 30573 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 39,700 మంది ఈ మహహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in telangana


Read More: సెల్పీ విషాదం.. దుందుభి వాగులో యువకుడు గల్లంతు

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,192 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,39,700కి చేరింది. ప్రస్తుతమున్న 30,573 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,019 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 24,88,220కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.