యాప్నగరం

తెలంగాణలో ఉధృతంగా కరోనా.. నిత్యం రెండువేలు దాటుతున్న కేసులు

కరోనా కేసులు నిత్యం రెండువేల దాటుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పదకొండువందలకు చేరువలో ఉంది. అయితే రికవరీ రేటు పెరగడంతో కాస్త ఊరట కలిగిస్తోంది.

Samayam Telugu 26 Sep 2020, 9:59 am
తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 1,83,866కు చేరుకున్నాయి. కాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా తాజాగా11 మంది మృత్యువాతపడ్డారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు


రాష్ట్రంలో ఇప్పటివరకు 1,52,441 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,334 మంది చికిత్స పొందుతుండగా 1,091 మంది మృతి చెందారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవిడ్‌ మరణాల రేటు 0.59 శాతంగా ఉండగా రికవరీ రేటు 82.90 శాతంగా ఉందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 58,925 మంది కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష చేయగా ఇప్పటివరకు 28 లక్షల మందికి టెస్టులు చేసినట్లు వివరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.