యాప్నగరం

తెలంగాణలో కరోనా కలకలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు తాజాగా ఎన్నంటే

తెలంగాణలో తాజాగా నమోదవుతున్న కేసులు కలవరం రేపుతున్నాయి. మళ్లీ రెండువేల సంఖ్య ను దాటి పాజటివ్ కేసులు నమోదుకావడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు.

Samayam Telugu 23 Aug 2020, 8:43 am
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్నాయి. మొన్నటివరకు రెండు వేల లోపు నమోదవుతున్నా పాజిటివ్ కేసులు మళ్లీ రెండు వేలు దాటి రికార్డ్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం 2384 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 4249కు చేరింది. మొత్తం 11 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 755కు చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
telangana corona cases

Read More: కరోనా చికిత్స పేరుతో లక్షల్లో ఫీజు.. నల్గొండ ప్రైవేట్ ఆస్పత్రి సీజ్
గత 24 గంటల్లో కోలుకొని డిశ్చార్జ్ అయిన వారు 1851మంది ఉన్నారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 22,908. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారి సంఖ్య 16,379. గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. హైదరాబాద్‌లో 472, నిజామాబాద్‌లో 148, నల్గొండలో 137 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 131, సూర్యాపేట 110, మేడ్చల్‌లో 52, కరీంనగర్‌లో 120, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో 105 , మంచిర్యాల జిల్లాలో 90 కేసులు నమోదు అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.