యాప్నగరం

తెలంగాణలో కరోనా విజృంభణ.. లక్షా 50వేలు దాటిన కేసులు

కరోనా నుంచి ఒక్క రోజే 2,071 మంది కోలుకున్నారు. ఎప్పటిలాగే గ్రేటర్ పరిధిలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 927 మంది మరణించారు.

Samayam Telugu 10 Sep 2020, 9:43 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,50,176 కు చేరాయి. తాజాగా వైరస్‌తో 11 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 927కు చేరింది. ఇక వైరస్‌ నుంచి 24 గంటల్లో 2,071 మంది కొలుకోగా, మొత్తం 1,17,143 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona virus cases in telangana


Read More: అన్ని కారిడార్లలో మెట్రో పరుగులు.. బాగా తగ్గిపోయిన ప్రయాణికుల సంఖ్య

ప్రస్తుతం రాష్ట్రంలో 25,066 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. మరో 25,066 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.61శాతం ఉండగా, దేశంలో 1.68 శాతంగా ఉందని చెప్పింది. అలాగే రికవరీ రేటు 78శాతంగా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న ఒక్క రోజే 327 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కొవిడ్‌ నిర్థారణ పరీక్షల సంఖ్య 19,53,571కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.