యాప్నగరం

తెలంగాణలో 2574 కరోనా కేసులు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 325 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత స్థానంలో రంగారెడ్డి జిల్లా నిలిచింది. 24 గంటల్లో 62వేల టెస్టులు నిర్వహించారు.

Samayam Telugu 6 Sep 2020, 9:52 am
తెలంగాణలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. నిత్యం రెండువేలకు మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 2,574 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 9 మంది కరోనా వలన చనిపోయారు దీంతో ఇప్పటిదాకా కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 886 కు చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
telangana coronavirus cases

ఇప్పటిదాకా కరోనా నుండి 1,07,530 మంది కోలుకోగా తాజాాగా ఒక్కరోజే 2,927 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.

Read More: మన్యంలో ఉద్రిక్తత.. బంద్‌కు మావోయిస్టుల పిలుపు

ఇక రాష్ట్రంలో 32,553 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అందులో 25,449 మంది హాస్పిటల్స్ లో కాకుండా హోం ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 62,736 శాంపిల్స్ టెస్ట్ చేయగా ఇప్పటిదాకా టెస్ట్ చేసిన శాంపిల్స్ సంఖ్య 17,30,389కి చేరింది. ఎప్పటిలానే జీహెచ్ఎంసీలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజే ఇక్కడ 325 కేసులు నమోదు కాగా ఆ తరువాతి స్థానంలో రంగారెడ్డి జిల్లా 197 కేసులతో నిలిచింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 185, నల్గొండ 158, కరీంనగర్‌ 144, ఖమ్మం 128, వరంగల్‌ అర్బన్‌ 117, సూర్యపేట 102 అత్యధికంగా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.