యాప్నగరం

తెలంగాణలో కొత్తగా 2751 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మరణాలు 8వందలు దాటాయి. పాజిటివ్ కేసులు లక్షా 20వేలకు చేరింది. గ్రేటర్ పరిధిలోనే భారీగానే కేసులు నమోదు అయ్యాయి.

Samayam Telugu 29 Aug 2020, 12:13 pm
తెలంగాణ కరోనా కలకలం రేపుతూనే ఉంది. తాజాగా నమోదైన కేసుల సంఖ్యకు సంబంధించిన వివరాల్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2751 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య లక్షా 20,126కు చేరింది. తాజాగా 1,675 మంది కోలుకోగా ఇప్పటివరకు 89,350 మంది కోలుకున్నారు. 23,049 మంది చికిత్స పొందుతున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
telangana corona cases


రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 808 కి పెరిగింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 62,300 కరోనా టెస్టులు చేశారు. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1675 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. హైదరాబాద్ లో ఎప్పటి లానే భారీగా 432 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోలుకున్న వారి రేటు 75.2కు చేరుకుంది. కరీంనగర్‌ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్‌ 133, సూర్యాపేఏట 111, వరంగల్‌ అర్బన్‌ 101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.