యాప్నగరం

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా 2817 కేసులు

రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకునన వారి సంఖ్య తాజాగా లక్ష దాటింది. దీంతో ప్రజలకు కాస్త ఊరట దొరికినట్లైంది. రికవరీ రేటు కూడా బాగానే ఉంది.

Samayam Telugu 3 Sep 2020, 10:11 am
తెలంగాణలో కరోనా వైరస్‌ కలకలం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2817 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. 24గంటల్లో 59,711 శాంపిల్స్‌ పరీక్షించారు. తాజాగా మరో 2611 మంది కోలుకోవడంతో డిశ్చార్జి అయినవారి సంఖ్య 1,00,013గా ఉంది. రాష్ట్రంలో తాజాగా మరో 10 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 856కి చేరింది.
Samayam Telugu కరోనావైరస్
corona cases telangana


రాష్ట్రంలో రికవరీ రేటు 74.9శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.64శాతంగా ఉంది. ప్రస్తుతం 32,537 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి- 216, కరీంనగర్ 164, ఖమ్మం 157, నల్గొండ 157 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణాలో 14,83,267 కరోనా పరీక్షలు చేశారు.

Read More: తెలంగాణ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

మరోవైపు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మనదేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 83,883 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో 1,043 మంది మరణించారు. నిన్న 68,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.