యాప్నగరం

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

కరోనా మరణాలు మొత్తం 1505కు చేరుకున్నాయి. కరోనాతో తాజాగా ముగ్గురు మృతి చెందారు. మరోవైపు మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 63లక్షలకు చేరింది.

Samayam Telugu 17 Dec 2020, 9:58 am
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. తాజాగా రిలీజ్ చేసిన కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 509 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 48,652 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,505కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
coronavirus cases in Telangana


Read More: ప్రాణం తీసిన ఓవర్ టేక్.. అతివేగంతో ముగ్గురు మృతి

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,79,644కి చేరింది. ఇందులో 2,70,967 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,172 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇంతవరకు తెలంగాణలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 63,06,397కి చేరింది. రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల రేటు 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 96.89శాతంగా ఉందని చెప్పింది. . తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 104, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 45, రంగారెడ్డి జిల్లాలో 42 కేసులు రికార్డయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.