యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల 1518కు చేరాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య రెండులక్షల 820 వేలు దాటింది.

Samayam Telugu 22 Dec 2020, 10:03 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. నిన్న మూడువందలకు పైగా కరోనా కేసులు నమోదు అయితే.. ఇవాళ తాజాగా 600కు పైగా పాజిటివ్ కేసులు రికార్డ్ అయ్యాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 45,227 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 617 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,82,347కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,518కి చేరింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana


Read More: జొన్నరొట్టెలు తిని ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

కరోనాబారి నుంచి నిన్న 635 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,74,260కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,569 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 4,400 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 65,20,993కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా 103 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో తీవ్రత కొనసాగుతోంది. 50కి పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.