యాప్నగరం

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1451కు చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు రెండు లక్షలు 68వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Samayam Telugu 28 Nov 2020, 10:13 am
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు
corona cases in Telangana
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 41,991 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 753 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,68,418కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,451కి చేరింది.

Read More: మోదీ టార్గెట్‌.. చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియో

రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే కరోనాబారి నుంచి 952 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,56,330కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,637 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,459 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 53,74,141కి చేరింది.

మరోవైపు దేశంలో కొత్తగా 41,322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 93,51,110కు చేరింది. ఇందులో 4,54,940 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 87,59,969 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,36,200 మంది మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కరోనా వల్ల 485 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.