యాప్నగరం

తెలంగాణలో 862 కరోనా పాజిటివ్ కేసులు

నిన్న ఒక్క రోజే 2,676 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరణాల సంఖ్య 1444కు చేరింది.

Samayam Telugu 26 Nov 2020, 9:50 am
తెలంగాణలో కరోనా కేసులు తగ్గతూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే కరోనా వ్యాప్తి మాత్రం రాష్ట్రంలో కొనసాగుతోంది. తాాజాగా గడిచిన 24 గంటల్లో 862 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు కరోనా వైరస్ తీవ్ర ఇన్‌ఫెక్షన్ కారణంగా మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,66,904 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,444 మంది మృతి చెందారు. తాజాగా 961 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 2,676 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Samayam Telugu తెలంగాణ కరోనా కేసులు


Read More: హైదరబాద్‌ను చూసి కొందరు అసూయపడుతున్నారు.. సీపీ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 10,784 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 8,507 మంది చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, దేశంలో 1.5 శాతం ఉంది. అలాగే రికవరీ రేటు రాష్ట్రంలో 95.41, దేశంలో 93.7శాతం ఉంది.ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 164 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరి 91, ఖమ్మం 63, భద్రాది కొత్తగూడెం 53 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.