యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే

రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్నాయి. ఇవాళ కూడా 9వందలు దాటి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరణాల సంఖ్య 1415కు చేరింది.

Samayam Telugu 18 Nov 2020, 9:42 am
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 42,433 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 948 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,59,776కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,415కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 1,607 మంది కోలుకున్నారు.
Samayam Telugu తెలంగాణ కరోనా లక్షణాలు
corona cases in telangana


Read More: GHMC Elections: 30 సీట్లు గెలిస్తే చాలు.. గ్రేటర్ మేయర్ పీఠం టీఆర్ఎస్‌దే!

దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,45,293కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 10,710 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 49,72,407కి చేరింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, ఇదే దేశంలో 1.5 ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 94.42 శాతం ఉండగా, దేశంలో 93,5 శాతం ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.