యాప్నగరం

తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

ప్రస్తుతం రాష్ట్రంలో 13,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత రెండు రోజులుగా తగ్గిన కేసులు మరోసారి పెరిగాయి. ఇవాళ 9వందలు దాటి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Samayam Telugu 17 Nov 2020, 10:34 am
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా తగ్గినట్లే తగ్గిన కరోనా కేసలు మళ్లీ పెరిగాయి. నిన్నమొన్న 5 నుంచి 6వందలు వరకు నమోదైన కేసులు తాజాగా 9వందలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 952 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 2.58 లక్షలకు చేరింది. 1,410 మంది మరణించారు.
Samayam Telugu తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
coronavirus cases in telangana


Read More: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నా జీవితంతో ఆడుకున్నాడు.. ట్యాబ్లెట్లు మింగేసిన రాధా రమణి

ప్రస్తుతం తెలంగాణలో 13,732 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 2.43లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. అయితే రోజూ అరవై వేల వరకు కరోన పరీక్షలు చేస్తున్నారు. కానీ కొద్ది రోజుల నుంచి ఈ టెస్ట్ ల సంఖ్య బాగా తగ్గించారు. ఒక్క రోజే 38,245 పరీక్షలు చేయగా, ఇప్పటిదాకా 49,29,974 కరోనా పరీక్షలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.