యాప్నగరం

TS కరోనా బులిటెన్.. హైదరాబాద్‌లో కేసులు తగ్గుముఖం.. జిల్లాల్లో విజృంభణ

తెలంగాణలో మంగళవారం 1897 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 9 మంది చనిపోయారు. హైదరాబాద్‌లో కొత్తగా 479 కేసులను గుర్తించారు.

Samayam Telugu 12 Aug 2020, 9:14 am
తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వరుసగా మూడో రోజు 2 వేల కంటే తక్కువగా నమోదైంది. మంగళవారం రాష్ట్రంలో 1897 కొత్త కేసులను గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 84,544కు చేరింది. మంగళవారం తెలంగాణలో కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 654కు చేరింది. మంగళవారం అత్యధికంగా 1920 మంది కరోనా నుంచి కోలుకొని హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రికవరీ అయిన వారి సంఖ్య 61 వేలు దాటింది.
Samayam Telugu నమూనా చిత్రం
Representative image.


మంగళవారం రాష్ట్రంలో 22,972 టెస్టులు చేశారు. రాష్ట్రంలో మొత్తం 6.65 లక్షలకుపైగా కరోనా టెస్టులు చేయగా.. 84,544 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,596 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో మరోసారి 500 కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. హైదరాబాద్ నగర పరిధిలో మంగళవారం 479 కేసులను గుర్తించారు. మేడ్చల్‌లో 172, రంగారెడ్డి 162, సంగారెడ్డి 107, వరంగల్ అర్బన్ 87, కరీంనగర్ 64, ఖమ్మం 63 చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోని 33 జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాగా.. కొమురం భీం ఆసిఫాబాద్ (5) జిల్లాలో మాత్రమే మంగళవారం సింగిల్ డిజిట‌్‌లో కేసులు నమోదయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.