రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి అప్పు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన(pradhan mantri gram sadak yojana) కింద మంజూరైన రోడ్లకు కేంద్రం అప్పు ఇస్తేనే పనులు చేయగలమంటూ లేఖ రాసింది. . పంచాయతీరాజ్ ఈఎన్సీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీకి ఈ లేఖ పంపించారు. నక్సల్స్ ప్రభావిత జిల్లాలతో పాటు 32 జిల్లాలకు పీఎంజీఎస్వై కింద మూడు విడుతల్లో మంజూరైన రోడ్లను పూర్తి చేసేందుకు రూ. 967.61 రుణం కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ పథకం కింద రోడ్లు నిర్మించేందుకు రాష్ట్ర వాటా 40 శాతం వెచ్చించేందుకు నిధులు లేవని స్పష్టం చేసింది. దీంతో పాటు రెండేళ్ల క్రితం రాష్ట్రానికి మంజూరు చేసిన రోడ్లకు సైతం ప్రైస్ ఎస్కలేషన్ ఇవ్వాలని లేఖలో కోరింది.
పీఎంజీఎస్వై ఫేస్ - 1,2 కింద రూ. 241.26 కోట్లు మాత్రమే ఇచ్చారని వాటికి సంబంధించిన ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. 2020లో ఇచ్చిన ఈ రోడ్లకు ఇప్పుడు సగటున 16శాతం ధరలు పెరిగాయని, పరిపాలనా అనుమతి ఖర్చు సగటున 21 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. స్టీల్, ఇసుక, సిమెంట్ ధరల ప్రకారం అదనంగా మరో రూ. 51.52 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరిగిన ధరల వివరాలను కేంద్రానికి వెల్లడించింది.
పీఎంజీఎస్వై ఫేస్ - 1,2 కింద రూ. 241.26 కోట్లు మాత్రమే ఇచ్చారని వాటికి సంబంధించిన ధరలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది. 2020లో ఇచ్చిన ఈ రోడ్లకు ఇప్పుడు సగటున 16శాతం ధరలు పెరిగాయని, పరిపాలనా అనుమతి ఖర్చు సగటున 21 శాతం పెరిగిందని స్పష్టం చేసింది. స్టీల్, ఇసుక, సిమెంట్ ధరల ప్రకారం అదనంగా మరో రూ. 51.52 కోట్లు విడుదల చేయాలని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరిగిన ధరల వివరాలను కేంద్రానికి వెల్లడించింది.