యాప్నగరం

ఆర్టీసీ జేఏసీ అత్యవసర భేటీ.. సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం

RTC JAC నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మె, భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Samayam Telugu 20 Nov 2019, 3:28 pm
ర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సమ్మె అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన నేపథ్యంలో బుధవారం (నవంబర్ 20) మధ్యాహ్నం ఎంజీబీఎస్‌లో నేతలు అత్యవసరంగా భేటీ అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu jac
ఆర్టీసీ జేఏసీ


47 రోజులుగా సమ్మె కొనసాగుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం, హైకోర్టులోనూ చుక్కెదురవడంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకూ కుటుంబ పోషణ భారమవుతుండటంతో నేతలపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో సమ్మె కొనసాగింపు ఆంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Must Read: ఆర్టీసీ ప్రైవేటీకరణ వద్దని ఏ చట్టమైనా చెబుతోందా.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం ఆర్టీసీ కార్మిక సంఘాలు వేర్వేరుగా సమావేశమై ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకున్నాయి. అనంతరం జేఏసీ సమావేశంలో వాటిపై సుదీర్ఘంగా చర్చించాయి. ఆ తర్వాత జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. మెజారిటీ కార్మికులు సమ్మె కొనసాగించడానికే మొగ్గు చూపారని వెల్లడించారు.

Also Read: ప్రశాంత్ ప్రేమకు పాక్‌కు సంబంధం ఏంటి? సరిహద్దు ఎలా దాటాడు? కీలక వివరాలు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.