యాప్నగరం

మున్సి‘పోల్స్’ నోటిఫికేషన్ విడుదల.. కరీంనగర్ మినహా!

Telangana మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. కరీంనగర్ కార్పొరేషన్ మినహా రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 180 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

Samayam Telugu 8 Jan 2020, 8:55 am
రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా మున్సిపల్‌ ఎన్నికల నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి వెల్లడించారు. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. మంగళవారం (జనవరి 7) రాత్రి మీడియాతో మాట్లాడిన ఆయన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు తేడా ఉన్నందున కరీంనగర్‌ కార్పొరేషన్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయలేదని వెల్లడించారు. బుధవారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు.
Samayam Telugu మున్సిపల్ ఎన్నికలు


రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్‌ ప్రకటించారంటూ టీపీసీసీ ఆధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియరైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల కోలాహలం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నాయి.

కరీంనగర్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 325 కార్పొరేటర్‌, 2,727 కౌన్సిలర్‌ స్థానాలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను 25న వెల్లడిస్తారు. మేయర్లు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ల ఎన్నిక తేదీని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

Also Read: కేసీఆర్ పిలిచినా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

కరీంనగర్‌లో ఓటర్ల ముసాయిదా జాబితా, తుది జాబితాకు తేడా ఉన్నందున రిజర్వేషన్లలో ఏవైనా తేడాలుంటాయా, లేదా అనే అంశంపై పురపాలక శాఖను వివరణ కోరినట్లు నాగిరెడ్డి తెలిపారు. పురపాలక శాఖ వెంటనే వివరణ ఇస్తే అర్ధరాత్రి లోపు నోటిఫికేషన్‌ విడుదల చేసి, కరీంనగర్‌కూ ఇదే షెడ్యూల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమైన తేదీలు:
నామినేషన్ల స్వీకరణ: జనవరి 8 నుంచి 10
నామినేషన్ల పరిశీలన: జనవరి 11
నామినేషన్ల ఉపసంహరణ గడువు: జనవరి 14
పోలింగ్‌: జనవరి 22
కౌంటింగ్: జనవరి 25

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలను ఆపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ పిటిషన్లపై వరసగా రెండో రోజైన మంగళవారం (జనవరి 7) విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.