యాప్నగరం

తెలంగాణలో టెన్త్ విద్యార్థులకు శుభవార్త.. ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచితంగా ప్రయాణం

Telangana Tenth Students Free Bus Travel పదో తరగతి పరీక్షలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎలాంటి ఒత్తిడి వద్దని.. పరీక్షలకు బాగా సిద్ధం కావాలని సూచించారు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో టెన్త్ విద్యార్థులు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. హాల్ టికెట్లు చూపిస్తే చాలు బస్సులో ఫ్రీగా వెళ్లొచ్చని తెలిపారు మంత్రి సబిత.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 30 Mar 2023, 7:19 am

ప్రధానాంశాలు:

  • తెలంగాణ టెన్త్ పరీక్షలపై మంత్రి సమీక్ష
  • పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లపై ఆరా తీశారు
  • విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా జర్నీ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Telangana Tenth Students Free Bus
తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షలకు ఏర్పాట్లపై సమీక్ష చేశారు.. కొన్ని సూచనలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారని.. మొత్తం 2,652 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాం చేయొచ్చని.. తమ హాల్ టికెట్లు చూపిస్తే చాలు అన్నారు.
టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లు, ఆందోళన లేకుండా సిద్ధమవ్వాలని సూచించారు. ఒకవేళ విద్యార్థులకు పరీక్షలపై సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని సూచించారు. అలాగే విద్యార్థుల్లో స్కూళ్ల యాజమాన్యాలు, టీచర్లు, తల్లిదండ్రులు మనో ధైర్యం నింపాలన్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ఎండల తీవ్రత ఉందని.. పరీక్షా కేంద్రాల దగ్గర తాగునీరు, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదని.. దీనికి తగినట్లుగా ఏర్పాట్లు ఉండాలన్నారు.

అలాగే పరీక్షా కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు, కంట్రోల్‌ రూం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే హాల్‌టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించామని.. విద్యార్థులు ఆన్‌లైన్లో డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఈసారి పరీక్ష పేపర్ల సంఖ్యను 11 నుంచి ఆరుకి తగ్గించామని.. సైన్స్‌ పరీక్ష రోజు ఫిజిక్స్, బయాలజీ ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు విడివిడిగా అందిస్తామన్నారు. అలాగే సమస్యాత్మక పరీక్షా కేంద్రాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. అవసరమైన చోట విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూసుకోవాలని సూచనలు చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు ఏప్రిల్‌ 3న ప్రారంభం కానున్నాయి. ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:30 వ‌ర‌కు జరుగుతాయి. ఆ షెడ్యూల్ ఇలా ఉంది.. ప‌రీక్ష‌లు ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయి.. అయితే 9:35 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే విద్యార్థుల‌ను అనుమ‌తిస్తామ‌ని మంత్రి తెలిపారు.

ఏప్రిల్ 3 – ఫ‌స్ట్ లాంగ్వేజ్
ఏప్రిల్ 4 – సెకండ్ లాంగ్వేజ్
ఏప్రిల్ 6 – థ‌ర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్‌)
ఏప్రిల్ 8 – గ‌ణితం
ఏప్రిల్ 10 – సామాన్య శాస్త్రం (ఫిజిక్స్, బ‌యాల‌జీ)
ఏప్రిల్ 11- సాంఘిక శాస్త్రం
ఏప్రిల్ 12 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-1
ఏప్రిల్ 13 – ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్-2

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.