యాప్నగరం

కర్ణాటక చేపట్టిన రెండు ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరం

Telangana: కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన అప్పర్ భద్ర, అప్పర్ తుంగ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులు జారీ చేయడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. దిగువ రాష్ట్రాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.

Authored byశ్రీనివాస్ గంగం | Samayam Telugu 11 May 2022, 10:04 pm
ర్ణాటక ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రెండు ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జలసంఘానికి లేఖ రాసింది. అంతర్రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్‌ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వరాదని లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులిస్తే తుంగభద్ర నుంచి కృష్ణాకు ప్రవాహం తగ్గుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దిగువ రాష్ట్రాల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Samayam Telugu అప్పర్ భద్ర
Telangana govt opposes CWC clearance to Karnataka's Upper Bhadra and Upper Tunga projects


అప్పర్‌ తుంగ, అప్పర్‌ భద్ర ప్రాజెక్టులకు బచావత్‌ ట్రైబ్యునల్‌ ఎలాంటి కేటాయింపులు చేయలేదని.. ప్రాజెక్టు అప్రయిజల్‌ డైరెక్టరేట్‌కు రాసిన ఈ లేఖలో ఈఎన్‌సీ మురళీధర్ గుర్తుచేశారు. బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఉన్నప్పటికీ.. సుప్రీం కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ హోదా కల్పించిన విషయం తెలిసిందే.
రచయిత గురించి
శ్రీనివాస్ గంగం
శ్రీనివాస్ రెడ్డి గంగం సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. EJS నుంచి శిక్షణ పొందిన శ్రీనివాస్‌కు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. JNTU నుంచి BTech చేశారు. గతంలో ప్రముఖ పత్రికల్లో వార్తలు, విద్యా సంబంధిత అంశాలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.