యాప్నగరం

TS: కొత్తగా 2 వేలకుపైగా కరోనా కేసులు.. ఆ జిల్లాల్లో వేగంగా వైరస్ వ్యాప్తి

తెలంగాణ జిల్లాల్లో కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వరంగల్ అర్భన్, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.

Samayam Telugu 5 Aug 2020, 9:19 am
తెలంగాణలో కొత్తగా 2 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 21,118 శాంపిళ్లను పరీక్షించగా.. 2012 పాజిటివ్ కేసులను గుర్తించారు. మరో 1167 శాంపిళ్ల ఫలితం తేలాల్సి ఉంది. మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కేసులను గుర్తించారు. మేడ్చల్ 198, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్ అర్బన్ 127 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఖమ్మం 97, సంగారెడ్డి 89, నిజామాబాద్ 83, కామారెడ్డి 75, భద్రాద్రి కొత్తగూడెం 52, మహబూబ్ నగర్ 51 చొప్పు కేసులు నమోదయ్యాయి.
Samayam Telugu Coronavirus
Representative image


గత కొన్నాళ్లుగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఖమ్మంలో కేసులు 100కు చేరువ కావడంతో స్థానికులు ఉలిక్కి పడ్డారు. జనగామ, ఆసిఫాబాద్ జిల్లాల్లో కేసులేవీ నమోదు కాలేదు. మంచిర్యాలలో మంగళవారం ఒక్క కేసు మాత్రమే నమోదైంది.

రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 70,958కి చేరింది. మంగళవారం కోవిడ్ బారిన పడి 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 576గా నమోదైంది. రాష్ట్రంలో మంగళవారం 1139 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ కేసుల సంఖ్య 50,814కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 19,568 యాక్టివ్ కేసులు ఉండగా.. 12,938 మంది హోం క్వారంటైన్లో లేదా ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 5.22 లక్షల మందికి కరోనా టెస్టులు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.