యాప్నగరం

Hyderabad: మరింత పెరగనున్న చలి.. ఆ ప్రాంతాల్లో ఇంకా!

IMD: పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే, ఉదయం 10 గంటల వరకూ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది.

Samayam Telugu 17 Jan 2020, 9:17 am
రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు విపరీతంగా తగ్గపోతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య భారతం నుంచి తెలంగాణవైపు తేమగాలులు వీస్తుండడంతోనే చలి పుట్టుకొస్తోందని వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, భద్రాద్రి కొత్త గూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత బాగా ఉంది.
Samayam Telugu Winter in Hyderabad


మరోవారంపాటు చలి తీవ్రత ఇలాగే కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. కాగా, పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే నమోదవుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే, ఉదయం 10 గంటల వరకూ దట్టమైన పొగమంచు అలుముకుంటోంది.

ఈ వారం ప్రారంభంలో తెల్లవారుజామున హైదరాబాద్‌లో 17.7, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 10.7, హన్మకొండలో 14.5, నిజామాబాద్, రామగుండంలో 15 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వారాంతంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

శుక్రవారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలు నమోదు కాగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 29 డిగ్రీలుగా ఉంది. రాబోయే వారంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీలుగా, గరిష్ఠం 31-32 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.