యాప్నగరం

రిజర్వేషన్లు పెంచాలి.. ఎస్టీ విద్యార్థుల ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తం

ST Students Protest: రిజర్వేషన్లు పెంచాలని, విద్యా, ఉద్యోగ రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్టీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.

Samayam Telugu 9 Dec 2019, 6:43 pm
హైదరాబాద్‌‌లో గిరిజన విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. రిజర్వేషన్లను 6 నుంచి 12 శాతానికి పెంచుతూ విద్య, ఉద్యోగ రంగాల్లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి గిరిజన విద్యార్థి సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం (డిసెంబర్ 9) ఆందోళన చేపట్టారు.
Samayam Telugu chalo


సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి గిరిజన విద్యార్థులు, నాయకులు వందలాది మంది ప్రగతి భవన్‌కు ర్యాలీగా రావడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేశారు. నిరసనకారులు కేసీఆర్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ముందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు పలువురిని అరెస్టు చేసి ఠానాలకు తరలించారు.

Don't Miss: శెభాష్ తెలంగాణ పోలీస్.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.