యాప్నగరం

హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టు

Gandhi Bhavan: ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క వారితో వాగ్వాదానికి దిగారు. డీసీఎంలలో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

Samayam Telugu 28 Dec 2019, 12:54 pm
గాంధీభవన్ వద్ద టెన్షన్ వాతావరణ నెలకొంది. పోలీసుల తీరుపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ‘తిరంగ ర్యాలీ’ చేపట్టేందుకు నాయకులు ప్రయత్నిస్తుండగా, వారిని అడ్డుకొని గాంధీభవన్ బయట పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సేవ్ నేషన్-సేవ్ కాన్‌స్టిట్యూషన్ పేరుతో ర్యాలీ చేయాలని నిర్ణయించారు. గాంధీభవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ వరకూ ర్యాలీ చేయాలని తలపెట్టారు. మరోవైపు ట్యాంక్ బండ్ వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Samayam Telugu gandhi-bhavan


Also Read: నిప్పులపై నడుస్తూ వెళ్లిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

గాంధీ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు పహారా కాయడంతో వారి తీరుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తిరంగ ర్యాలీ చేసి తీరతామని నేతలు స్పష్టం చేశారు. ర్యాలీని బలవంతంగా అడ్డుకున్నందున కాంగ్రెస్ నాయకులు గాంధీ భవన్‌లోనే సత్యాగ్రహ దీక్ష చేస్తున్నారు. మరోవైపు డీసీఎంలలో వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు.

Also Read: ఫోటోలు: సైకిల్‌పై ఒంటరిగా వెళ్లి.. కలెక్టర్ ఆకస్మిక సోదాలు

అంతకుముందు గాంధీ భవన్ ముందు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. వీరిలో ముఖ్య నాయకులు కుంతియా, భట్టి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు, పొన్నం తదితరులు ఉన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తమ కార్యకర్తలు గాంధీ భవన్‌కు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, హైదరాబాద్ కమిషనర్ అంజనీ కుమార్ కేసీఆర్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు కాంగ్రెస్ భయం పట్టుకుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీని వాయిదా వేసుకోబోదని, ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించి తీరతామని భట్టి స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ర్యాలీకి మద్దతిచ్చిన కేసీఆర్, ఎంఐఎంతో కలిసి బీజేపీకి మద్దతు పలుకుతున్నాయని ధ్వజమెత్తారు.

Also Read: పెట్రోలు పంపులో నుంచి నీళ్లు.. 50 వాహనాల్లో పెట్రోలుకు బదులు..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.